ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు సంబంధించి ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈసారి ఫలితాలను సాధారణం కంటే ముందుగానే విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, అలాగే ఇతర పోటీ పరీక్షల షెడ్యూల్లపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వాల్యూయేషన్ ప్రక్రియను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా పలు స్థాయిల్లో పర్యవేక్షణ చేపట్టారు. ప్రతి సమాధాన పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ, విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
గతంలో ఫలితాల విడుదలలో ఆలస్యం కారణంగా విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ వంటి ప్రవేశ పరీక్షల అప్లికేషన్లు, కౌన్సెలింగ్ ప్రక్రియల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తుగా ఫలితాలను విడుదల చేయాలని రెండు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి.
అయితే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
