సౌతాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత క్రికెట్ బొర్డ్ (బీసీసీఐ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆదివారం విడుదల చేసిన ఈ జాబితాలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.మెడ నొప్పి కారణంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ సిరీస్కు దూరమవ్వడంతో, కేఎల్ రాహుల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వైస్ కెప్టెన్గా ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా గాయం కారణంగా జట్టులో లేకపోవడం తొ ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో జట్టులో కొత్త కాంబినేషన్లు ప్రయత్నించే అవకాశం ఉంది.
సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మరోసారి వన్డే జట్టులో రీఎంట్రీ ఇవ్వడం టీమిండియాకు పెద్ద బలంగా మారింది. వారి అనుభవం, టాప్ ఆర్డర్లో స్థిరత్వం జట్టుకు మంచి ఉపు ఇచ్చెదిగా ఉంటుంది.
SA VS INDIA Venues
మొదటి వన్డే నవంబర్ 30న రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. అనంతరం, రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించబడుతుంది. చివరిగా, సిరీస్ను ముగించే మూడో వన్డే డిసెంబర్ 6న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA–VDCA స్టేడియంలో జరగనుంది.
Squad
KL రాహుల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా
