ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఏప్రిల్ 25 లేదా 26వ తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఈ సంవత్సరం పరీక్షలు 16 మార్చి 2026 తేదీ నుంచి 02 ఏప్రిల్ 2026 తేదీ వరకు నిర్వహించబడగా, ఏప్రిల్ 06 నుంచి 15వ తేదీ వరకు మూల్యాంకనం కొనసాగింది. ఫలితాల విడుదలపై నారా లోకేష్ గారు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తరచూ అప్డేట్లు ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థులకు ఈసారి అదనంగా మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. హిందీ విషయంలో 2 మార్కులు, ఇంగ్లీష్ విషయంలో 5 మార్కులు కలుపుతున్నారు.
ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ results.bse.ap.gov.in ద్వారా తమ మార్కులను చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా Manabadi, Schools9 వంటి ప్రైవేట్ పోర్టల్స్లో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
