ఈ రోజులలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. చిన్న దుకాణాలు, కూరగాయల వ్యాపారులు, ఆటో డ్రైవర్లు కూడా యూపీఐనే ఎక్కువగా వాడుతున్నారు. అయితే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వేస్తారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రతి వెయ్యి రూపాయలు పంపితే కొంత డబ్బు కట్ అవుతుందని కొన్ని పోస్టులు చెబుతున్నాయి. ఈ వార్తల వల్ల చాలా మంది, ముఖ్యంగా చిన్న వ్యాపారులు మరియు సాధారణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
![]() |
| UPI transactions free of charge, NPCI official clarification |
దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రతిరోజూ కోట్ల రూపాయల లావాదేవీలు ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఇలాంటి లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ, వేరే వేరే వదంతులు కూడా సామాజిక మాధ్యమాల్లో విస్తరిస్తుంటాయి. ఇటీవలి కాలంలో కొన్ని పోస్టులు రూ.వెయ్యి పంపితే కూడా బ్యాంకులు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తాయని ప్రచారం చేస్తున్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వం మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ వార్తలను తప్పని చెప్పాయి. ప్రస్తుత విధానం ప్రకారం, వ్యక్తులు ఒకరికొకరు (P2P) లేదా వ్యక్తులు వ్యాపారాలకు (P2M) చేసే సాధారణ యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగా ఉంటాయి. ఒక్క రూపాయి కూడా కట్ కాదు అని చెప్పుతున్నారు.
అంతేకాదు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యూపీఐ, రూపే (RuPay) లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏకంగా రూ.2 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించారు.
