ప్రస్తుత రబీ సీజన్లో రైతులు సాగు చేస్తున్న ప్రతి పంట వివరాలను ఈ-క్రాప్ పోర్టల్లో ఖచ్చితంగా నమోదు చేయాలని, జిల్లా కలెక్టర్ ఏ. సిరి సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. పంటల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ఆమె స్పష్టంగా తెలిపారు.
గురువారం టెలి కాన్ఫరెన్స్లో పై విభాగాలకు చెందిన అధికారులతో పంటలకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా పంటల్లో వ్యాపిస్తున్న తెగుళ్లు, క్రిమికీటకాలను నివా రించి రైతులను నష్టాల నుంచి గట్టెక్కించాలని ఆదేశించారు. వ్యవ సాయ, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా ఉండాలని సూచించారు. కలెక్టర్ గారు మాట్లాడుతూ, ఈ-క్రాప్ నమోదు వ్యవసాయ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి రైతు యొక్క సాగు వివరాలు సమయానికి సరిగ్గా నమోదు చేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. పంటల సరైన రికార్డులు ఉంటే ప్రభుత్వానికి పంట బీమా, నష్టపరిహారం, సబ్సిడీ వంటి పథకాలను సులభంగా అందించగలమన్నారు. రైతులు ఎక్కడ ఏ పంటలు సాగు చేస్తున్నారో స్పష్టమైన సమాచారం ఉంటే, నీటి పంపిణీ, ఎరువుల సరఫరా, మరియు మార్కెట్ ప్లానింగ్ వంటి అంశాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చని కలెక్టర్ సూచించారు.

