భారత్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ స్క్వాడ్ విడుదల.. అందరి దృష్టి 16 ఏళ్ల ప్లేయర్‌పైనే!

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సమరం ముగియగానే ఇరు జట్లు వన్డే పోరుకు సిద్ధం కానున్నాయి. జూలై 14 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ క్రికెట్ అభిమానుల్లో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ 16 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును అధికారికంగా ప్రకటించింది.

Ind VS Eng squad

భారత గడ్డపై సత్తా చాటడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సరికొత్త వ్యూహాలతో వన్డే జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టుకు యువ సంచలనం హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్, జో రూట్, జాకోబ్ బెథెల్ వంటి స్టార్ ఆటగాళ్లతో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు ఎంతో బలంగా కనిపిస్తున్నాయి.

ఈ జట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది యువ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్. కేవలం 16 ఏళ్ల వయసులోనే ససెక్స్ తరఫున అరంగేట్రం చేసిన ఈ ప్రతిభావంతుడికి ఇప్పుడు ఇంగ్లాండ్ జాతీయ జట్టులో చోటు దక్కింది. అతడి ఎంపికపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

భారత్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలా జేమ్స్ కోల్స్ కూడా తన ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకుని ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వన్డే సిరీస్‌లో అతని ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.

ఇంగ్లాండ్ పూర్తి వన్డే జట్టు:

హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జాకోబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, జో రూట్, జోష్ టంగ్.

Post a Comment

Previous Post Next Post

Contact Form