అఫ్గానిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్ కోసం టీమిండియా జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ క్రికెటర్లకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ సిరీస్కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.జట్టులో శ్రేయస్ అయ్యర్తో పాటు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే వంటి బ్యాటర్లు ఉన్నారు. దీంతో భారత బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది.యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి కుడా ఈ సిరీస్ చోటు దక్కింది.
వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఉండగా ఆల్రౌండర్ల జాబితాలో నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే ఉన్నారు. స్పిన్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్లకు అవకాశం ఇచ్చారు.టీ20 మ్యాచ్ల్లో వీరిద్దరూ వికెట్లు తీయగల బౌలర్లుగా గుర్తింపు పొందారు.ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి కి అఫ్గానిస్థాన్తో రికార్డ్ అయితె ఉన్నాయి ఇక పేస్ బౌలింగ్ విషయానికి వస్తాతె జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా లకు అవకాశం ఇచ్చారు బుమ్రా తన అనుభవంతో జట్టుకు బలం కానుండగా, అర్ష్దీప్ సింగ్ కూడా ముఖ్యమైన బౌలర్గా ఉన్నాడు. అయితె బుమ్రా ఐపిఎల్ లో అంతగా ఫామ్ ఉన్నాటు గా కనిపించలేదు ఈ సిరీస్ లో అయిన ఫామ్ లోకి వస్తాడమో చుడాలి మరి
అఫ్గానిస్థాన్–భారత్ మధ్య 3 టీ20 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ప్రస్తుతం అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మూడు మ్యాచ్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జరుగుతాయి.
టీమిండియా జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.
