వెండితెరపై తన విలక్షణమైన నటనతో, పవర్ఫుల్ విలనిజంతో దక్షిణాది సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ ఇప్పుడు క్రీడా రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. టాలీవుడ్లో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన రవితేజ 'క్రాక్' (Krack) సినిమాలో జయమ్మ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఆమె ఎంతగానో దగ్గరయ్యారు. ఆ తర్వాత అల్లరి నరేష్ 'నాంది' (Naandhi), నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' (Veera Simha Reddy), మరియు సమంత 'యశోద' (Yashoda) వంటి చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించి మెప్పించారు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గ్లోబల్ హిట్ 'హను-మాన్' (HanuMan) సినిమాలో అంజమ్మగా ఆమె అద్భుత నటనతో మంచి గుర్తింపు సాధించారు.
అయితే ఇప్పుడు వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) క్రీడారంగంలోకి కూడా అడుగుపెట్టారు. తమిళనాడు పికిల్బాల్ అసోసియేషన్ (Tamil Nadu Pickleball Association - TNPA) నిర్వహించే తమిళనాడు ప్రీమియర్ పికిల్బాల్ లీగ్ (TNPPL) సీజన్-2లో పాల్గొనే చెన్నై తమిళ్ టైటాన్స్ జట్టుకు ఆమె యజమానిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ విషయాన్ని తమిళనాడు పికిల్బాల్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. వరలక్ష్మి శరత్కుమార్ను జట్టు యజమానిగా స్వాగతిస్తున్నామని తెలిపింది. క్రీడలపై ఆమెకు ఉన్న ఆసక్తి, అత్యుత్తమ ప్రతిభను ప్రోత్సహించే తత్వం లీగ్కు మరింత బలం చేకూరుస్తుందని అసోసియేషన్ పేర్కొంది.
Ravindra G
✓ Verifiedమేము ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా వార్తలు, అన్ని ప్రభుత్వ ఉద్యోగలకు సంబంధించిన పుస్తకాలు న్యూస్ తాజా అప్డేట్లను ఆధారంగా పరిశీలించి, నమ్మదగిన, ఖచ్చితమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడం మా లక్ష్యం. News
