రెండు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా శుక్రవారం తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్ ఆడబోతోంది. అయితే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం సూర్యకుమార్ యాదవ్తో పాటు పలువురు ఆటగాళ్లు ఈ సిరీస్కు దూరమయ్యారు.
జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. దీంతో యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించింది.
ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. ఇప్పటికే అతను టీమిండియా జెర్సీని అందుకున్నాడు. కొత్త ఆటగాళ్ల చేరికతో టీమిండియా కాంబినేషన్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి.
జూన్ 26 శుక్రవారం ఐర్లాండ్తో జరిగే తొలి టీ20 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కితే, అతను ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలవడంతో పాటు, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును కూడా బద్దలు కొట్టనున్నాడు.
దీంతో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఐర్లాండ్ సిరీస్లో అతని ప్రదర్శనపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
