ఢిల్లీలో ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ నేతల ధర్నాతో ఒక్కసారిగా ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. విద్యార్థుల్ని బీజేపీ ప్రభుత్వం క్రూరంగా హింసించిందని ఆరోపిస్తూ, విద్యార్థులపై అణచివేతకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ నాయకులు లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసం ముందు ధర్నాకు దిగారు.

ఈ ధర్నాలో పవన్ ఖేరా, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, దీపేందర్ హూడా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Congress leaders led by Rahul Gandhi stage a protest outside the Prime Minister's residence at Lok Kalyan Marg in New Delhi

విద్యార్థుల సమస్యలను పార్లమెంట్‌లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు, వెంటనే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, ధర్నా కొనసాగుతున్న సమయంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి చేరుకుని రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. ప్రభుత్వం పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపినట్లు సమాచారం.

అయితే తమ ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని రాహుల్ గాంధీ పట్టుబట్టినట్లు వార్తలు వెల్లడించాయి. చర్చలు ఫలించకపోవడంతో కాంగ్రెస్ నేతలు నిరసనను కొనసాగించారు.

Ravindra G

Ravindra G

✓ Verified
SEO Content Writer & Webdesigner

మేము ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా వార్తలు, అన్ని ప్రభుత్వ ఉద్యోగలకు సంబంధించిన పుస్తకాలు న్యూస్ తాజా అప్‌డేట్లను ఆధారంగా పరిశీలించి, నమ్మదగిన, ఖచ్చితమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడం మా లక్ష్యం. News

Post a Comment

Previous Post Next Post

Contact Form